1766 - వికీపీడియా
1766 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
- నవంబర్ 12 : సలాబత్ జంగును అతని సోదరుడు నిజాం ఆలీ ఖాను కూలదోసి, రాజమండ్రిని, శ్రీకాకుళాన్ని హసన్ ఆలీ ఖానుకు లీజు కిచ్చాడు. రాబర్టు క్లైవు మొగలు చక్రవర్తి షా ఆలంతో సంప్రదించి, ఉత్తర సర్కారులను ఈస్ట్ ఇండియా కంపెనీకి ధారాదత్తం చేసినట్లుగా ఆగస్టు 1765 లో ఫర్మానా తెప్పించాడు. కాని దానిని మార్చి 1766 వరకు రహస్యంగా ఉంచాడు. బ్రిటిషు వారు కొండపల్లి దుర్గాన్ని ఆక్రమించారు. అవసరమైతే సైనిక చర్య చేపట్టడానికై జనరలు సిల్లాడ్ను మచిలీపట్నం పంపించారు. నిజాము కూడా శీఘ్రంగా యుద్ధ సన్నాహాలు చేసాడు. నవంబరు 12, 1766 న కుదిరిన ఒప్పందం వలన యుద్ధం తప్పింది.
తేదీ వివరాలు తెలియనివి
[మార్చు]
- హెన్రీ కావెండిష్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా లోహాలను ఆమ్లంతో చర్యజరిపి ఉదజనిని తయారు చేశాడు.
- పాలక్కాడ్ కోటను మైసూరుకు చెందిన హైదర్ ఆలీ నిర్మించాడు.
- జనవరి 1: మహారాజా చందు లాల్, హైదరాబాద్ రాజ్యానికి ప్రధానమంత్రిగా, పేష్కరుగా పలు హోదాల్లో పనిచేసిన రాజకీయవేత్త. (మ.1845)
- ఫిబ్రవరి 13 : థామస్ రాబర్ట్ మాల్థస్ బ్రిటీష్ ఆర్థికవేత్త[1]
- సెప్టెంబర్ 6: జాన్ డాల్టన్ పరమాణు సిద్ధాంతానికి పునాదులు వేసిన బ్రిటీష్ శాస్త్రవేత్త
తేదీ వివరాలు తెలియనివి
[మార్చు]
![](https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/03/Brooklyn_Museum_-_Chandhu_La%27l.jpg/220px-Brooklyn_Museum_-_Chandhu_La%27l.jpg)
- చందు లాల్ సదన్ హైదరాబాదు రాజ్యానికి ప్రధానమంత్రిగా, పేష్కరుగా పలు హోదాల్లో పనిచేసిన రాజకీయవేత్త.
- ↑ "Malthus, Thomas Robert (MLTS784TR)"[permanent dead link]. A Cambridge Alumni Database. University of Cambridge.